ప్రిపరేషన్ పద్ధతి |
||
---|---|---|
|
||
దేశ రక్షణలో యువతను భాగస్వామ్యులను చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 1961లో సైనిక పాఠశాలలకు
(సైనిక్ స్కూల్స్)కు శ్రీకారం చుట్టింది. వీటిలో కేవలం బాలురకు మాత్రమే ప్రవేశం కల్పించి వారిని మానసికంగా,
శారీరకంగా, విద్యాపరంగా సుశిక్షితులను చేయడం ఈ స్కూల్స్ ఏర్పాటు ప్రధాన ఉద్దేశం. దీనికోసం దేశవ్యాప్తంగా
24 సైనిక స్కూళ్లను ప్రారంభించారు. ఈ స్కూళ్లలో 12వ తరగతి వరకు బోధన జరుగుతుంది. తర్వాత వీరిని
పుణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ)లో ప్రవేశం పొందడానికి యూపీఎస్సీ నిర్వహించే రాత పరీక్షకు
సిద్ధమయ్యే విధంగా తీర్చిదిద్దుతారు.
ఆంధ్రప్రదేశ్లో.. కోరుకొండ సైనిక స్కూళ్ల ఏర్పాటులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా కోరుకొండలో ఒక స్కూల్ను ఏర్పాటు
చేశారు. ఇది 1962 జనవరి 18 నుంచి విద్యార్థులకు అందుబాటులోకి వచ్చింది. త్వరలో చిత్తూరు జిల్లాలో కూడా
మరొక సైనిక స్కూల్ ఏర్పాటు కానుంది.
సైనిక పాఠశాలల్లో చేరడానికి ఏం చేయాలి? ఏ తరగతులకు శిక్షణ ఇస్తారు? ఎలాంటి అర్హతలు ఉండాలి, స్కాలర్షిప్లు
తదితర వివరాల గురించి తెలుసుకుందాం...
ఏ తరగతులకు ప్రవేశం లభిస్తుంది? వీటిలో 6, 9 తరగతులకు ప్రవేశం కల్పిస్తారు. ఇంటర్ వరకు బోధన ఉంటుంది. ఒక్కసారి ఆరు లేదా తొమ్మిదో
తరగతిలో చేరితే చాలు ఇంటర్ పూర్తిచేసే వరకూ చదువు కొనసాగించవచ్చు. మొదట ఆల్ఇండియా
సెకండరీ స్కూల్ఎడ్యుకేషన్ (టెన్త్క్లాస్), తర్వాత ఆల్ ఇండియా సీనియర్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ (ఇంటర్)కు
వీరిని సిద్ధం చేస్తారు. ఇంటర్ తర్వాత వీరిని పుణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరేందుకు అర్హత కల్పించే
పరీక్షకు అవసరమైన శిక్షణ కూడా ఇస్తారు. ఈ పరీక్షను యూపీఎస్సీ నిర్వహిస్తుంది. విద్యార్జనలో భాగంగా
ఎన్సీసీ అందరికీ తప్పనిసరి.
అర్హులు: ఈ పాఠశాలల్లో చేరేందుకు కేవలం బాలురు మాత్రమే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఎన్ని సీట్లు ఉన్నాయి? ఆరో తరగతికి 65 సీట్లు, తొమ్మిదో తరగతికి 25 సీట్లు ఉన్నాయి. వీటిలో 67 శాతం సీట్లను ఆయా రాష్ట్రాల
స్థానికులకు కేటాయిస్తారు. మొత్తం సీట్లలో 15 శాతం ఎస్సీలకు, 7.5 శాతం ఎస్టీలకు, 25 శాతం డిఫెన్స్
వారికి కేటాయిస్తారు.
ఎలా చేరాలి? సైనిక స్కూల్లో 6, 9 తరగతుల్లో చేరేందుకు ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. దీనికి ప్రతి సంవత్సరం అక్టోబరు
లేదా నవంబరులో నోటిఫికేషన్ జారీ చేస్తారు. దీన్లో చూపిన ప్రతిభ ఆధారంగా ఇంటర్వ్యూకు పిలుస్తారు.
ఇక్కడ కూడా రాణిస్తే తుది ఎంపిక పూర్తవుతుంది.
ఎన్నిసార్లు రాయవచ్చు? ఈ పరీక్ష రాసేందుకు విద్యార్థికి ఒక్కసారి మాత్రమే అవకాశం ఇస్తారు. దీన్లో ఫెయిల్ అయితే మరోసారి రాసే వీలు లేదు. పరీక్ష కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి? రాష్ట్రంలో గుంటూరు, హైదరాబాద్, కరీంనగర్, తిరుపతి, విశాఖపట్నంలలో ఈ పరీక్ష జరుగుతుంది. |
||
ఆరో తరగతిలో ప్రవేశం
|
||
|
||
ప్రవేశ పరీక్ష విధానం ఏమిటి?
దీన్లో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. అవి... పేపర్ -1: మ్యాథమెటిక్స్ అండ్ లాంగ్వేజ్ (పేపర్ -2) - 200 మార్కులు పేపర్ -3: ఇంటెలిజెన్స్ - 100 మార్కులు మొత్తం - 300 మార్కులు ఎన్ని మార్కులు రావాలి? జనరల్కేటగిరీ అభ్యర్థులు ప్రతి పేపర్లో కనీసం 25 శాతం మార్కులు తెచ్చుకోవాలి. సగటున 40 శాతం
మార్కులు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు మార్కుల నిబంధనలు లేవు.
ఇంటర్వ్యూ: రాత పరీక్షలో ప్రతిభ చూపిన వారికి 1:3 నిష్పత్తిలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్యూకు
50 మార్కులు కేటాయించారు. మొత్తం మార్కుల ఆధారంగా స్కూల్లో చేర్చుకుంటారు.
సిలబస్- ప్రిపరేషన్ టెక్నిక్స్ సీబీఎస్సీ విధానంలో 5వ తరగతి సిలబస్ను పరీక్షకు ప్రామాణికంగా తీసుకుంటారు. కాబట్టి విద్యార్థులు
సీబీఎస్ఈ 5వ తరగతి పాఠ్యపుస్తకాలను బాగా చదవాల్సి ఉంటుంది.
సిలబస్ వివరాలు... 1) ఇంగ్లిష్: దీన్లో ఎస్సే రైటింగ్, కాంప్రహెన్షన్, ఒకాబ్యులరీ అండ్ యూసేజ్, జెండర్, యాంటోనిమ్స్, సినానిమ్స్,
సెంటెన్స్ టైప్స్, రీ అరేంజింగ్ వర్డ్స్, వెర్బ్ ఫామ్స్, ఎడ్జెక్టివ్, నౌన్స్, యాడ్వెర్బ్స్, గ్రమాటికల్ స్ట్రక్చర్స్ ఉంటాయి.
ప్రిపరేషన్: సీబీఎస్ఈ 5వ తరగతి ఇంగ్లిష్ టెక్స్ట్బుక్ మొత్తాన్ని ఒక క్రమ పద్ధతిలో చదివేందుకు తల్లిదండ్రులు,
ఉపాధ్యాయులు విద్యార్థికి తోడ్పడాలి. పరీక్ష తేదీని దృష్టిలో పెట్టుకుని సమయాన్ని ఎలా కేటాయించాలో పటిష్టమైన
ప్రణాళిక రూపొందించాలి. దాని ప్రకారం విద్యార్థి చదివేందుకు తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలి. సిలబస్
మొత్తం పూర్తి చేసిన తర్వాత బిట్ పేపర్ను బాగా ప్రాక్టీస్ చేయాలి. దీనివల్ల ఏ అంశంలో సులభంగా మార్కులు
వస్తున్నాయో, ఎక్కడ ఇబ్బంది ఎదురవుతోందో తెలుస్తుంది. తర్వాత వాటిని కూలంకషంగా చదివి మరింత
అవగాహన పెంచుకోవాలి. దీనివల్ల పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు వచ్చినా కంగారు పడాల్సిన అవసరం ఉండదు.
సులభంగా సమాధానాలు ఇవ్వగలుగుతారు.
2) మ్యాథమెటిక్స్: దీన్లో నంబర్ సిస్టమ్, ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్, కమర్షియల్ మ్యాథమెటిక్స్ (పర్సెంటీజీలు, ప్రాఫిట్ అండ్ లాస్,
రేషియో అండ్ప్రపోర్షన్, టైమ్ అండ్ వర్క్), క్యాష్ బిల్స్ ప్రిపరేషన్, టెంపరేచర్ మెజర్మెంట్ ఉంటాయి.
అలాగే మెన్సురేషన్, జామెట్రీ (ప్రాథమిక భావనలు) ఉంటాయి.
ప్రిపరేషన్ టెక్నిక్స్: ఇక్కడ కూడా విద్యార్థికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తగిన నిర్దిష్ట ప్రణాళికను అందించడం
వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ సబ్జెక్టుకు ప్రాక్టికల్ వర్క్ చాలా అవసరం కాబట్టి సీబీఎస్సీ 5వ తరగతి
మ్యాథ్స్ టెక్స్ట్ బుక్పై మొదట పూర్తి అవగాహన ఏర్పర్చుకోవాలి. తొందరగా సమాధానాలు తెచ్చుకుంటున్న
అంశాల కంటే క్లిష్టంగా ఉన్న వాటిపై ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. లెక్కలు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు
విద్యార్థికి అనేక సమస్యలు ఎదురవుతాయి. వాటి పరిష్కారానికి సంబంధిత టీచర్ను లేదా అనుభవజ్ఞులను
సంప్రదించి సందేహాలు నివృత్తి చేసుకోవాలి. సిలబస్ అంతా పూర్తి చేసిన తర్వాత బిట్ బ్యాంక్ను ప్రాక్టీస్ చేయడం
మరిచిపోకూడదు. దీనివల్ల వేగం పెరుగుతుంది. పరీక్షలో సమయం ఆదా అవుతుంది. తద్వారా సమాధానాలు
రాని ప్రశ్నలకు ఎక్కువ సమయాన్ని కేటాయించే వీలు కలుగుతుంది.
ఇంటెలిజెన్స్: ఇది పూర్తిగా జనరల్ టాపిక్. దీనికోసం మార్కెట్లో దొరికే మంచి ఇంటెలిజెన్స్ మెటీరియల్ను
సాధన చేయడం అవసరం. ఈ మెటీరియల్ ఎక్కువగా ఇంగ్లిష్లోనే ఉంటుంది కాబట్టి ఇంగ్లిష్ భాషపై ఎక్కువ
అవగాహన పెంచుకోవాలి. అలాగే మ్యాథమెటిక్స్ ప్రాథమిక భావనలపై కూడా పట్టు పెంచుకోవాలి.
మోడల్ పేపర్ల ప్రాక్టీస్: పరీక్ష తేదీకి నెల ముందు నుంచీ మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేయడం అవసరం. నిర్ణీత
సమయాన్ని కేటాయించి ఈ పేపర్లు చేయడం వల్ల పరీక్షలో సమయాన్ని ఎలా సద్వినియోగం చేయాలో తెలుస్తుంది
. మంచి స్కోర్కు అవకాశం ఏర్పడుతుంది.
|
||
9వ తరగతి ప్రవేశ విధానం
|
||
|
||
Powered By: Mahesh